Friday, 6 March 2020

Corona Calculum .. Google, Apple

శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతకకరోనా వైరస్ (CoronaVirus) కు సంబంధించిన విషయాలపై సెర్చింజిన్ గూగుల్, యాపిక్ ఫోకస్ చేస్తున్నాయి. కరోనా వైరస్‌పై దుష్ప్రచారం చేస్తున్న COVID-19కు సబంధించిన యాప్స్‌ను తమ యాప్ స్టోర్ నుంచి డిలీట్ చేసేందుకు నిర్ణయించాయి. గుర్తింపు పొందిన ఆరోగ్య సంస్థల వివరాలకు సంబంధించిన యాప్స్ ను మాత్రమే ఉంచి, మిగతా యాప్స్ అందిస్తున్న డేటాను కస్టమర్లకు అందుబాటులో లేకుండా చేసే దిశగా యాపిల్, గూగుల్ ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
కరోనా వైరస్‌ల పేరుతో ప్లే స్టోర్లలో అందుబాటులో ఉండే డేటా వల్ల యాప్ యూజర్లు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని సంస్థలు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గుర్తింపు లేని సంస్థలు అందిస్తున్న కరోనా వైరస్ సమాచారాన్ని తొలగిస్తున్నారు. యాపిల్ యాప్ స్టోర్‌లో COVID 19 పేరుతో టైప్ చేస్తే 'వైరస్ ట్రాకర్' అని వస్తోంది. దీన్ని హెల్త్ లింక్డ్ అనే యాప్ వస్తుంది. ఇది డబ్ల్యూహెచ్ఓ సంస్థ అందించే కరోనా పాజిటీవ్ కేసుల వివరాలను అందిస్తోంది.
గూగుల్ ప్లేలో సెర్చ్ చేస్తే 'Coronavirus: Stay informed' పేరుతో ఉన్న వెబ్ సైట్‌లో సీడీసీ, రెడ్ క్రాస్, ట్విట్టర్ సంస్థలు అందించే సమాచారం కనిపిస్తుంది. ఫేస్ బుక్, ట్విట్టర్ సైతం కరోనా వైరస్‌లకు సంబంధించి జరుగుతున్న దుష్ప్రచారంపై ఫోకస్ చేస్తున్నాయి. కాగా, భారత్‌లో కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించి చర్యలు తీసుకుంటున్నాయి.

Thursday, 5 March 2020

కరోనా ఎఫెక్ట్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !

ఇప్పటివరకు వ్యాక్సిన్ లేని కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. భారత్ లో కూడా ఇప్పటికే 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పేరు వింటేనే ఇప్పుడు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటు తెలంగాణలోనూ కరోనా కలవరపెడుతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విద్యార్థుల్లో ఎవరికైనా జలుబు, జ్వరం ఉంటే, వారు స్కూలుకు రావద్దని పాఠశాల విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ సీహెచ్ రమణ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్యాలయం, జిల్లాల పరిధిలో డీఈఓలు వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Pawankalyan fans


కరోనా ఎఫెక్ట్: బహిరంగ ప్రదేశాల్లో మాంసం అమ్మకాలపై నిషేధం

లక్నో: భారత్‌లో కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో అనేక నగరాలు వ్యాప్తి నిరోధక చర్యలు చేపడుతున్నాయి. అనుమానితులను గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లోని లక్నో జిల్లా మెజిస్ట్రేట్ ఓ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మాంసం అమ్మకాల్ని నిషేధిస్తూ ఆజ్ఞతు జారీ చేశారు. 'కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో మాంసం, చేపల అమ్మకాలను నిషేధించాం. మాంసం ద్వారా వైరస్ వ్యాపించ కూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ హోటళ్లు, రెస్టారెంట్లను ఆదేశించాం' అని జిల్లా మెజిస్ట్రేట్ ఓ ప్రకటనలో తెలిపారు. 

టీ20 ప్రంపచకప్‌: ఫైనల్స్‌లో భారత్‌

వర్షం కారణంగా భారత్‌ X ఇంగ్లాండ్‌ సెమీస్‌ రద్దు
సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తొలిసారి ఫైనల్‌ చేరింది. భారత్‌ X ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్‌ను వర్షం కారణంగా రద్దు చేశారు. దీంతో హర్మన్‌ప్రీత్‌సేన సెమీస్‌ ఆడకుండానే నేరుగా ఫైనల్‌ చేరింది. గత టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌-ఎలో టీమ్‌ఇండియా నాలుగు లీగ్ మ్యాచ్‌లు గెలవడంతో మెరుగైన రన్‌రేట్‌ కారణంగా తుదిపోరుకు అర్హత సాధించింది. మరోవైపు ఆస్ట్రేలియా X దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన రెండో సెమీస్‌పైనా నీలినీడలు కమ్ముకొన్నాయి.

Laxis Storage Box For Clothes, Foldable Clothes Oraniser For Wardrobe With Transparent Window Zipper

 Laxis  Storage Box For Clothes, Foldable Clothes Oraniser For Wardrobe With Transparent Window Zipper Non Wowen Saree Covers Storage Bag Id...