Thursday, 5 March 2020

టీ20 ప్రంపచకప్‌: ఫైనల్స్‌లో భారత్‌

వర్షం కారణంగా భారత్‌ X ఇంగ్లాండ్‌ సెమీస్‌ రద్దు
సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తొలిసారి ఫైనల్‌ చేరింది. భారత్‌ X ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్‌ను వర్షం కారణంగా రద్దు చేశారు. దీంతో హర్మన్‌ప్రీత్‌సేన సెమీస్‌ ఆడకుండానే నేరుగా ఫైనల్‌ చేరింది. గత టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌-ఎలో టీమ్‌ఇండియా నాలుగు లీగ్ మ్యాచ్‌లు గెలవడంతో మెరుగైన రన్‌రేట్‌ కారణంగా తుదిపోరుకు అర్హత సాధించింది. మరోవైపు ఆస్ట్రేలియా X దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన రెండో సెమీస్‌పైనా నీలినీడలు కమ్ముకొన్నాయి.

No comments:

Post a Comment

Laxis Storage Box For Clothes, Foldable Clothes Oraniser For Wardrobe With Transparent Window Zipper

 Laxis  Storage Box For Clothes, Foldable Clothes Oraniser For Wardrobe With Transparent Window Zipper Non Wowen Saree Covers Storage Bag Id...